చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి సేవలో కేంద్ర మంత్రి

చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి సేవలో కేంద్ర మంత్రి

హైదరాబాద్ చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారిని కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కేంద్ర మంత్రికి ఘనస్వాగతం పలికారు. అమ్మవారి పవిత్ర మందిరాన్ని చేరుకోవడం, అమ్మవారి దర్శించుకొని ఆశీస్సులు పొందడం సంతోషంగా ఉందని అనురాగ్ ఠాకూర్ తెలిపారు. తెలంగాణలో బీజేపీ బలపడుతుందని చెప్పారు.