
కరీంనగర్ ను అద్దంలా తీర్చిదిద్దుతానన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తెచ్చే బాధ్యత తనదేనని చెప్పారు. బండి సంజయ్ ను కరీంనగర్ నగర మేయర్ సునీల్ రావు, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం కార్పోరేటర్లు సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన బండి సంజయ్.. కరీంనగర్ అభివృద్ధిపై మంత్రి పొన్నం, ఎమ్మెల్యే గంగులతోనూ కలిసి చర్చిస్తానని చెప్పారు.
స్మార్ట్ సిటీ కింద మిగిలిన నిధులు త్వరలోనే మంజూరు చేయిస్తానని తెలిపారు. జన్మభూమి కరీంనగర్ గడ్డ రుణం తీర్చుకుంటానని తెలిపారు. అందరం కలిసి కరీంనగర్ అభివృద్ధి కోసం పనిచేద్దామని పిలుపునిచ్చారు. గొడవలు ఆపేసి రాబోయే జనరల్ బాడీలో అద్బుతమైన ప్రణాళికను రూపొందించాలని చెప్పారు.