అభివృద్ధికి ఓటు వేయండి : జి.కిషన్ రెడ్డి

అభివృద్ధికి ఓటు వేయండి : జి.కిషన్ రెడ్డి

పద్మారావునగర్: అభివృద్ధి, సంక్షేమంలో దేశాన్ని ఉన్నత స్థానంలో నిలిపిన ప్రధాని మోదీ ఆధ్వర్యంలో కేంద్రంలో మూడోసారి బీజేపీ సర్కార్ రానుందని కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి చెప్పారు. శుక్రవారం బన్సీలాల్​ పేట డివిజన్​లోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. స్థానికులను కలిసి లోక్​సభ ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలవాలని, చేసిన అభివృద్ధి, అందించిన సంక్షేమాన్ని చూసి ఓటేయాలని కోరారు. దేవినగర్, పద్మారావునగర్, బోయిగూడ ప్రాంతాల్లో కిషన్ రెడ్డి పర్యటన కొనసాగింది. జిల్లా బీజేపీ అధ్యక్షుడు శ్యాంసుందర్​ గౌడ్, పార్లమెంటరీ కన్వీనర్​టి.రాజశేఖర్​రెడ్డి తదితరులు పాల్గొన్నారు.