కరోనా వ్యాక్సిన్ సంజీవని లాంటిదన్నారు కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ రెడ్డి . ఢిల్లీలో వ్యాక్సినేషన్ ను ఆయన ప్రారంభించారు. మొదటి వ్యాక్సిన్ ను మనీశ్ కుమార్ అనే శానిటేషన్ సిబ్బందికి ఇచ్చారు. ఆ తరువాత హెల్త్ సిబ్బందికి ఇచ్చారు. ప్రపంచంలోనే ఇది పెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ అన్నారు హర్షవర్ధన్. ఇలాంటి డ్రైవ్ లు కండక్ట్ చేయడం భారత్ కు కొత్తేం కాదన్నారు. పోలియో, స్మాల్ పాక్స్ లతో ఆ అనుభవం సాధించామన్నారు. ఇవాళ చారిత్రాత్మకమైన రోజని.. సంవత్సరంగా కరోనాపై చేస్తున్న పోరాటానికి ముగింపు పలికే సమయం వచ్చిందన్నారు. వ్యాక్సిన్ పై వచ్చే పుకార్లు నమ్మొద్దని..శాస్త్రవేత్తలు,నిపుణుల మాటలే నమ్మాలని సూచించారు.
see more news
సుడిగాలి సుధీర్ వల్లే నాకు టీం లీడర్ ఇవ్వలే
భయపడొద్దు.. టీకా వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవ్
మోడీ నోట తెలుగు పద్యం.. వ్యాక్సిన్ ప్రారంభించిన ప్రధాని