ఫార్ములా ఈ రేస్‌కు హాజరైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ఫార్ములా ఈ రేస్‌కు హాజరైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

ఈవీ వెహికల్స్ ఉత్పత్తి పెంచేందుకు భారత ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్డులో జరుగుతున్న ఫార్ములా ఈ రేస్ కు హాజరైన కిషన్ రెడ్డి...ఈ రకమైన కార్యక్రమాల ద్వారా దేశ బ్రాండింగ్ టూరిజం పెరుగుతుందని చెప్పారు. ప్రపంచంలోనే అనేక దేశాలు గ్రీన్ ఎనర్జీకి షిఫ్ట్ అవుతున్నాయని వెల్లడించారు. పర్యావరణాన్ని కాపాడడం కోసం ప్రజలను మోటివేట్ చేయడానికి ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉపయోగపడతాయని కిషన్ రెడ్డి ఈ సందర్భంగా చెప్పారు. రాబోయే నాలుగైదు సంవత్సరాల్లో ఎలక్ట్రికల్ వెహికల్స్ వినియోగం భారీగా పెరుగుతుందని.. భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు కూడా దేశవ్యాప్తంగా జరుగుతాయని ఆయన తెలిపారు.