- ఇచ్చిన హామీలు సీఎం అమలు చేయలే
- కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఫైర్
హైదరాబాద్ , వెలుగు : తెలంగాణ లో సీఎం కేసీఆర్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమల్జేయలేదని, ఎలాంటి అభివృద్ధి జరగలేదని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆరోపించారు. కాంగ్రెస్ అబద్ధపు హామీలు ఇస్తున్నదని, వారు అధికారంలో ఉన్న ఏ రాష్ర్టంలో కూడా అభివృద్ధి జరగడం లేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఎలాంటి తేడా లేదన్నారు. సోమాజిగూడలోని బీజేపీ మీడియా సెంటర్లో శుక్రవారం రాజీవ్ చంద్రశేఖర్ మాట్లాడారు.
కర్నాటక ఎన్నికల్లో రూ.3 వేల భృతి ఇస్తామని చెప్పి, ఇప్పటికి ఇవ్వలేదని చెప్పారు. ఉచిత బియ్యం, గృహలక్ష్మి, గృహజ్యోతి పథకం కూడా అమలు చేయడం లేదన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోపై ప్రజలకు నమ్మకం లేకపోవడంతో గ్యారంటీలు అనే పదం తీసుకొచ్చారన్నారు.