ATMల్లో పెట్రోల్ పోసి నిప్పంటించిన గుర్తుతెలియని వ్యక్తులు

ATMల్లో పెట్రోల్ పోసి నిప్పంటించిన గుర్తుతెలియని వ్యక్తులు

హైదరాబాద్‌లోని చాంద్రాయణ గుట్టలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఏటీఎంల్లో పెట్రోల్ పోసి నిప్పంటించారు. బంగారు మైసమ్మ దేవాలయానికి సమీపంలో ఈ ఘటన జరిగింది. ICICI, ఆక్సిస్ బ్యాంకుల ATMల దగ్గరకు వచ్చిన దుండగులు ఈ చర్యకు పాల్పడిపారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆ ATMలు దగ్ధమయ్యాయని చెప్పారు.

CC కెమెరాల ద్వారా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. మధ్యరాత్రి సుమారుగా 3 గంటల 20 నిమిషాల సమయంలో ATM సెంటర్లలో మంటలు రావడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే వచ్చి మంటలు ఆర్పారని పోలీసులు తెలిపారు. గుంపుగా వచ్చిన కొందరు యువకుల ముఠా ఏటీఎంలో చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. చోరీ యత్నంలో భాగంగా ATM కు ఇంజన్ ఆయిల్ కూడా పూశారని తెలిసింది. అయినప్పటికీ అది తెరచుకోకపోవడంతో పెట్రోల్ పోసి తగులబెట్టి వెళ్లినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.