రేషన్ బియ్యంలో యూరియా  వచ్చింది

 రేషన్ బియ్యంలో యూరియా  వచ్చింది

లింగంపేట, వెలుగు: ప్రభుత్వం పేదలకు అందించే రేషన్ ​బియ్యంలో యూరియా వచ్చింది. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా లింగంపేటలో జరిగింది. గ్రామంలోని లబ్ధిదారులకు ఒకటో నంబర్​షాపులో ఆదివారం ఉదయం రేషన్ బియ్యం పంపిణీ చేశారు. కాశీ అనే వ్యక్తి 60 కిలోల బియ్యం తీసుకున్నాడు. ఇంటికి వెళ్లి చూసుకోగా అందులో నాలుగు కేజీల యూరియా వచ్చినట్లు గుర్తించాడు. వెంటనే ఈ విషయాన్ని రేషన్​ డీలర్, రెవెన్యూ ఆఫీసర్ ​దృష్టికి తీసుకెళ్లాడు. కాశీతోపాటు మరో నలుగురుకి పంపిణీ చేసిన బియ్యంలో యూరియా ఉన్నట్లు తెలిసింది. దీనిపై తహసీల్దార్ ​అమిన్ సింగ్ స్పందిస్తూ యూరియా విషయం తమ దృష్టికి వచ్చిందని.. పరిశీలిస్తున్నామన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.