ప్రధాని మోదీ రైతుల హృదయాల్లో నిలిచిపోతారు: కొండపల్లి శ్రీధర్ రెడ్డి

ప్రధాని మోదీ రైతుల హృదయాల్లో నిలిచిపోతారు: కొండపల్లి శ్రీధర్ రెడ్డి

ఖమ్మం రూరల్, వెలుగు: రైతుల హృదయాల్లో ప్రధాని మోదీ చిరస్థాయిగా నిలిచిపోతారని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి అన్నారు. గురువారం రాజస్థాన్ రాష్ట్రం సికిర్ నుంచి వర్చువల్ ద్వారా రైతులను ఉద్దేశించి ప్రధాని చేసిన ప్రసంగాన్ని తిరుమలాయపాలెం మండలంలోని దమ్మాయిగూడెం కిసాన్ సమృద్ధి కేంద్రంలో రైతులతో కలిసి కొండపల్లి చూశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూరియా కొరత నుంచి రైతులను కాపాడటం కోసం గతంలో వేపపూతతో కూడిన యూరియాను తెచ్చారన్నారు. ప్రధాని14వ విడత కిసాన్ సమ్మాన్ నిధి  నిధులను విడుదల చేశారన్నారు.

AsloRead:అదృష్టమంటే వీళ్లదే.. లాటరీ తగిలి రూ.10 కోట్ల జాక్‌పాట్‌ కొట్టేశారు

రాబోయే రోజుల్లో రైతు ఉత్పత్తి సంఘాలను ఏర్పాటు చేసి రైతులు ఆర్థికంగా బలపడేలా చేస్తారన్నారు. కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సౌజన్యంతో నిర్వహించిన రైతు సమ్మేళనంలో ఏవో సీతారాంరెడ్డి, కంపెనీ బాధ్యులు ఫణికుమార్, మధుసూదన్ రావు, రామారావు, అన్నదాత ఆగ్రోస్ జనరల్ మర్చంట్స్ సమృద్ధి కేంద్రం నిర్వాహకులు రమణ, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తక్కెళ్లపల్లి నరేంద్ర రావు, జిల్లా ఉపాధ్యక్షుడు గుండా శ్రీనివాస్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ మేక సంతోష్ రెడ్డి, మండల అధ్యక్షుడు బొడ్డుపల్లి ప్రసాద్, మండల నాయకులు గోవర్ధన్ పాల్గొన్నారు.