సందీప్ కిషన్, వర్ష బొల్లమ్మ జంటగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఊరు పేరు భైరవకోన’. అనిల్ సుంకర సమర్పణలో రాజేష్ దండా నిర్మించారు. ఫిబ్రవరి 16న సినిమా రిలీజ్ కానున్న సందర్భంగా రాజేష్ దండా మాట్లాడుతూ ‘వీఐ ఆనంద్ చెప్పిన కథ చాలా డిఫరెంట్గా అనిపించింది. తను చెప్పిన దానికి రెండింతలు అద్భుతంగా తీశారు.
ఇదొక ఫాంటసీ థ్రిల్లర్. గరుడపురాణంలో మిస్ అయిన పేజీలకి ఈ కథకి ఉన్న లింక్ ఏమిటనేది చాలా ఆసక్తిగా ఉంటుంది. విజువల్స్ చాలా గ్రాండ్గా ఉంటాయి. 47 నిమిషాల అద్భుతమైన సిజీ వర్క్ ఉంది. ప్రేక్షకులకు గొప్ప థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ని ఇస్తూ.. థ్రిల్ చేస్తుంది. ‘నిజమేనా చెబుతున్నా’ పాట సినిమాకు చాలా ప్లస్ అయ్యింది. ఈ కథకు సీక్వెల్, ప్రీక్వెల్ చేయొచ్చు.
రెండు ఆలోచనలు ఉన్నాయి. సందీప్ కెరీర్కు, మా బ్యానర్కు ఇది నెంబర్ వన్ సినిమా అవుతుంది. తన కెరీర్లోనే హయ్యెస్ట్ బడ్జెట్.. అలాగే హయ్యెస్ట్ బిజినెస్ కూడా చేసిన సినిమా ఇది. అందుకే విడుదలకు ముందే హ్యాపీగా ఉన్నాం. ఇప్పటికే ప్రీమియర్ షోస్ అన్నీ ఫుల్ అయ్యాయి. అనిల్ సుంకర గారి సలహాలు, సూచనలు మాకు చాలా హెల్ప్ అయ్యాయి. ఇక అల్లరి నరేష్, కిరణ్ అబ్బవరంతో సినిమాలు చేస్తున్నా’ అని చెప్పారు.