ఒలింపిక్స్ లో ఎనిమిది గోల్డ్ మెడల్స్ సాధించిన జమైకా దిగ్గజ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ కు కరోనా వైరస్ సోకింది. కోవిడ్ పాజిటివ్ రావడంతో ఉసేన్ బోల్ట్ సెల్ఫ్ క్వారంటైన్లో ఉన్నారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలిపారు.
పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ గా ఖరారైందని తెలిపారు ఉసేన్. అంతే కాదు ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తెలుపుతూ తాను బాధ్యతగా ఉండాలని అనుకుంటున్నాను అన్నారు. సన్నిహితులకు దూరంగా ఉంటున్నాను అన్నారు.ప్రస్తుతం ఎలాంటి లక్షణాలూ లేవు అని చెప్పిన ఉసేన్ బోల్ట్… హోమ్ క్వారంటైన్ లో ఉన్నాను అన్నారు. కరోనా ప్రొటోకాల్ గురించి హెల్త్ మినిస్ట్రీ నుంచి కొన్ని వివరాలను కోరాలని భావిస్తున్నాను అని అన్నారు. ఉసేన్ బోల్ట్ కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు హెల్త్ మినిస్ట్రీ సోమవారం అధికారికంగా ప్రకటించింది.
ఆగస్టు 21న ఉసేన్ బోల్ట్ తన 34వ పుట్టిన రోజును ఎంతో అట్టహాసంగా జరుపుకున్నారు. అయితే ఈ పార్టీకి పలువురిని ఉసేన్ బోల్ట్ కలిశారు. ఆ టైంలో ఏర్పాటు చేసిన పార్టీలో భౌతిక దూరం కనిపించకపోగా, కనీసం మాస్క్ లను కూడా ఎవరూ ధరించలేదని తెలుస్తోంది. ఇప్పుడు ఆ పార్టీకి హాజరైన వారందరిలోనూ ఆందోళన నెలకొంది. 21న బోల్ట్ ను కలిసిన వారిలో పలువురు ఇప్పటికే సెల్ఫ్ క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. ఆ పార్టీకి ప్రముఖ క్రికెటర్ క్రిస్ గేల్, మాంచెస్టర్ సిటీ స్టార్ స్టెర్లింగ్ లతో పాటు బేయర్ లెవెర్కుసేన్, అటాకర్ లియాన్ బెయిలీ తదితరులు కూడా హాజరయ్యారు.
Stay Safe my ppl ?? pic.twitter.com/ebwJFF5Ka9
— Usain St. Leo Bolt (@usainbolt) August 24, 2020