బీఆర్ఎస్ లో చేరికపై ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ

బీఆర్ఎస్ లో చేరికపై ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ

తాను పార్టీ వీడుతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని మరోసారి ఖండించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. తనపై కాంగ్రెస్ లోని ఓ కీలకనేతే పనిగట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. 30 ఏండ్లుగా పార్టీకోసం కష్టపడ్డానని.. సిన్సియర్ కార్యకర్తగా పనిచేస్తున్నానన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. తన స్థానాన్ని దిగజార్చేందుకు, ప్రజల్లో ప్రతిష్టను దెబ్బతీసేందుకు చూస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రజాజీవితంలో 24 గంటలు శ్రమిస్తున్నానన్నారు ఉత్తమ్.

తనకు పిల్లలు లేకపోయినా..ప్రజలే తన పిల్లలుగా భావించి సేవ చేస్తున్నానన్నారు. తనను, తన అనుచరులను పార్టీ నుంచి తొలగించే కుట్రలో భాగంగా ..పనిగట్టుకొని ఓ నేత దుష్ప్రచారం చేయిస్తున్నారని ఫైర్ అయ్యారు. ప్రాణ త్యాగాలకు సిద్ధపడే సైన్యంలో చేరానని.. స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసి రాజకీయాల్లోకి వచ్చానన్నారు. ఆరు సార్లు గెలిచినందుకు గర్విస్తున్నానన్నారు ఉత్తమ్. కేసీఆర్ తోనూ ఇప్పటి వరకు మాట్లాడలేదని.. తనకు ఎలాంటి వ్యాపార ఒప్పందాలు లేవన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.