లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుస్తుందని దేశానికి కాబోయే ప్రధాని రాహుల్ గాంధీయేనని రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు, ఆ పార్టీ నల్లగొండ ఎంపీ అభ్యర్థి ఉత్తమ్ కుమార్రెడ్డి అన్నారు.ఆదివారం మిర్యాలగూడలోని జేఎస్ఆర్ ఫంక్షన్ హాల్ లో, వేములపల్లి, దామరచర్ల మండలాల పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2014 ఎన్నికల సమయంలో బీజేపీ విదేశాల్లో అక్రమంగా పోగేసిన నల్లధనం తెప్పించి ప్రతి ఒక్కరి ఖాతాలో రూ.15లక్షలు జమచేస్తామని, లక్షల ఉద్యోగాలు ఇస్తామని వాగ్దానం చేసి నెరవేర్చలేదన్నారు. దేశంలో రైతుల ఆత్మహత్యలు రెట్టింపయ్యాయన్నారు. మతతత్వాన్ని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధిని పొందాలనుకుంటున్న మొదటి ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. బీజేపీకిఓటు వేస్తే టీఆర్ఎస్కు వేసినట్లే అన్నారు. డీమానిటైజేషన్, జీఎస్టీ అమలు విషయంలో బీజేపీకి టీఆర్ఎస్ సపోర్ట్ చేసిందన్నారు. బీజేపీని విమర్శిస్తూ సీఎంకేసీఆర్ ఆడుతున్న కొత్త డ్రామా హాస్యాస్పదంగా ఉందన్నారు. కేసీఆర్ ఈ ఐదేళ్లలో ఖాజీపేట రైల్వే స్టేషన్, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, గిరిజన విశ్వ విద్యాలయం ఎందుకు సాధించలేదో ప్రజలకు చెప్పాలన్నారు. 16మంది ఎంపీలను గెలిపిస్తే దేశ రాజకీయాలను శాసిస్తామంటున్న కేసీఆర్ ఇప్పటి వరకు కేంద్రం నుంచి నిధులు ఎందుకు రాబట్టలేక పోయరో చెప్పాలన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే వరి మద్దతు ధర క్వింటాల్ కు రూ. 2500కు పెంచుతామన్నారు. అనంతరం మాజీ సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి మాట్లాడారు. కేసీఆర్ ఎన్నికలహామీలను అమలు చేయడంలో విఫలమయ్యారన్నారు. దళితులకు మూడెకరాల భూమి ఇవ్వలేదు ..డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టలే దన్నారు. గత లోక్ సభఎన్నికల్లో ఈ స్థానంలో కాంగ్రెస్కు ఇచ్చిన మెజార్టీకిమించి ఈ ఎన్నికల్లో అందించాలని కోరారు. పార్టీకి నష్టమని తెలిసినా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన సోనియాగాంధీకి ఈ ఎన్నికల్లో ఉత్తమ్ ను గెలిపించి కానుక ఇవ్వాలని కోరారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రేపాల శ్రీనివాస్, డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్ ,సాముల శివారెడ్డి తదితరులున్నారు.
కాబోయే ప్రధాని రాహులే
- దేశం
- March 25, 2019
లేటెస్ట్
- సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ ఎమ్మెల్యేల వినతి పత్రం
- జనం నాన్ వెజ్ కంటే ..వెజ్ ఎక్కువగా ఇష్టపడుతున్నారట..సర్వేలు ఏం చెబుతున్నాయంటే..
- సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు క్యూ కడుతున్రు: కిషన్ రెడ్డి
- లోక్సభ ఎన్నికలు 2024:దేశవ్యాప్తంగా రూ.8,889 కోట్ల నగదు,మద్యం, డ్రగ్స్ సీజ్
- ఫేక్ సర్టిఫికెట్స్ దందా.. ఇద్దరు అరెస్ట్, నలుగురు పరార్
- 45లక్షల విలువైన చినూక్ హెలికాప్టర్ మిస్సింగ్?.. క్లారిటీ ఇచ్చిన రక్షణశాఖ
- 6 నెలల్లో PoKని భారతదేశంలో కలిపేస్తాం: యోగి ఆదిత్యనాథ్
- ఏపీలో ఎన్నికల అల్లర్లు.. వాటిపై నిషేధం..
- RCB vs CSK: వర్షం అంతరాయం.. ఆగిన చెన్నై - బెంగళూరు మ్యాచ్
- తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా
Most Read News
- SRH vs PBKS: సన్రైజర్స్తో మ్యాచ్.. కొత్త కెప్టెన్ను ప్రకటించిన పంజాబ్
- సుప్రీం కోర్టు తీర్పుపై షర్మిల సంచలన వ్యాఖ్యలు.. ట్వీట్ వైరల్
- SA v WI: వెస్టిండీస్తో టీ20 సిరీస్.. ద్వితీయ శ్రేణి జట్టును ప్రకటించిన సౌతాఫ్రికా
- కోర్టు వివాదంలో ల్యాండ్.. బారికెడ్లు తొలగించిన మల్లారెడ్డి.. పెట్ బషీరాబాద్ లో ఉద్రిక్తత
- వెండి ప్రియులకు బ్యాడ్ న్యూస్.. కిలో వెండి లక్ష రూపాయలా..!
- హైదరాబాద్ లో మళ్లీ మొదలైన వర్షం
- MI vs LSG: నీతా అంబానీతో సంభాషణ.. ముంబైకు రోహిత్ గుడ్ బై
- వరంగల్ లోతట్టు ప్రాంతాలకు..ముంపు ముప్పు..!
- గుడ్న్యూస్: గాల్లో తిరగనున్న హైదరాబాద్ జనాలు
- Weather alert: బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడే సూచనలు : ఏపీ, తెలంగాణకు భారీ వర్షాలు