ఉత్తమ్​ ఓకే.. మారిస్తే నాకే : జగ్గారెడ్డి

ఉత్తమ్​ ఓకే.. మారిస్తే నాకే : జగ్గారెడ్డి

హైదరాబాద్, వెలుగు: ‘పీసీసీ చీఫ్​గా ఉత్తమ్​ కుమార్​ రెడ్డి కంటిన్యూ అయితే ఓకే.. మార్చాలనుకుంటే మాత్రం నాకే అవకాశం ఇవ్వాలె’ అంటూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను ఎమ్మెల్యే జగ్గారెడ్డి కోరారు. సీఎల్పీలో మంగళవారం కాంగ్రెస్​ శాసన సభాపక్ష నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్​ రెడ్డి తదితరులు సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా పీసీసీ చీఫ్​ పదవిపైన కొద్దిసేపు చర్చ జరిగిందని సమాచారం. తర్వాత జగ్గారెడ్డి దీనిపై సరదాగా మాట్లాడుతూ.. పీసీసీ చీఫ్​ పదవి ఇప్పటికైతే శ్రీధర్​ బాబుకు ఇవ్వాలని, ఎన్నికల టైంలో రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వాలనుకుంటే.. పదవి ఆశించే రెడ్డి నేతలందరూ మాట్లాడుకుని ఒకరి పేరును సూచించాలన్నారు. పీసీసీ రేసులో మీరున్నారా అన్న ప్రశ్నకు జవాబిస్తూ.. పార్టీలోని రెడ్డి సామాజిక వర్గం నేతలంతా పీసీసీ చీఫ్​ పదవికి అర్హులేనని చెప్పారు.