- అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలి
- సీఎంవో కార్యదర్శి వి.శేషాద్రి ఆదేశం
ఇబ్రహీంపట్నం, వెలుగు: ఆరుట్ల పాఠశాలను కేవలం రాష్ట్రానికే కాకుండా దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దాలని సీఎంవో ముఖ్య కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ వి.శేషాద్రి ఆదేశించారు. బుధవారం రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆరుట్లలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ఆయన సందర్శించారు. హౌజింగ్ ఎండీ గౌతమ్ పొట్రు, విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళితో కలిసి పాఠశాల వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా తరగతి గదుల్లో విద్యార్థులతో ముచ్చటించారు.
అనంతరం గ్రామస్తులు, తల్లిదండ్రులతో సమావేశమై పాఠశాల పురోగతిపై చర్చించారు. ఆరుట్ల పాఠశాలను కేవలం రాష్ట్రానికే కాకుండా దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దాలని, ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని శేషాద్రి సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి, డీఈవో సుశీందర్ రావు, ఆర్డీవో అనంతరెడ్డి, టీచర్లు పాల్గొన్నారు.
