కరోనాతో V6 జర్నలిస్ట్ సందీప్ మృతి

కరోనాతో V6 జర్నలిస్ట్ సందీప్ మృతి

వీ6 కుటుంబం ఓ సభ్యుడిని కోల్పోయింది. వీ6 సెంట్రల్ డెస్క్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్న కాళేశ్వరం సందీప్ కరోనాతో మృతిచెందారు. సిద్దిపేట్ టౌన్ కు చెందిన సందీప్.. వీ6లో ట్రైనీ జర్నలిస్టుగా చేరి పదేళ్లుగా పనిచేస్తున్నారు. ఏప్రిల్ చివరి వారంలో సందీప్, ఆయన తల్లి కరోనా బారిన పడ్డారు. వారం కింద సందీప్ తల్లి హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయారు. తర్వాత సందీప్ కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండటంతో  హాస్పిటల్లో చేరారు. గురువారం ఆరోగ్యం విషమించడంతో  ఆయనను ఐసీయూలో చేర్చారు. ఈ రోజు పొద్దున సందీప్ చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. ఆయనకు భార్య, రెండేళ్ల పాప ఉన్నారు. సందీప్ మరణానికి వీ6 ఫ్యామిలీ నివాళులు అర్పించింది. సందీప్ కుటుంబానికి విశాక ఇండస్ట్రీస్ చైర్మన్ వివేక్ వెంకటస్వామి, విల్ మీడియా ఎండీ జి.వైష్ణవి, వీ6 సీఈఓ అంకం రవి సంతాపం తెలిపారు.