
హైదరాబాద్, వెలుగు: నగరానికి చెందిన రియల్ఎస్టేట్డెవెలపర్ వైష్ణోయి గ్రూప్ శంషాబాద్సమీపంలో గరుడ ప్రాజెక్టును ప్రారంభించింది. ఈ ప్రీమియం కమ్యూ నిటీ ప్రాజెక్టులో ఇది వరకే 160 యూనిట్లు అమ్ముడయ్యాయని ప్రకటించింది. మొత్తం మూడు టవర్లలో 330 విశాలమైన 2, 3 బెడ్రూమ్ల అపార్ట్ మెంట్లను నిర్మిస్తున్నారు. ఈ భవనాల్లో అలంకరణల కంటే గాలి, వెలుతురు, పనితీరు లేఔట్లకు ప్రాధాన్యత ఇస్తామని సంస్థ తెలిపింది.