బోయ కులస్తులను ఎస్టీ జాబితాలో చేరుస్తూ సీఎం కేసీఆర్ అసెంబ్లీలో తీర్మానం చేయడం పట్ల వాల్మీకి, బోయ ఐక్య కార్యాచరణ కమిటీ హర్షం వ్యక్తం చేసింది. ఈ తీర్మానానికి సహకరించిన గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, అల్లంపూర్ ఎమ్మెల్యే అబ్రహం లకు కమిటీ సభ్యులు హైదర్ గూడ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బోయ కులస్తులు అత్యధిక జనాభా కలిగి ఉన్నారని.. పక్క రాష్ట్రమైన కర్ణాటకలో బోయలు ఎస్టీలుగా ఉండటం వల్ల పెళ్లి సంబంధాలు కూడా వచ్చేవి కావని ఎమ్మెల్యే కృష్ణ మోహన రెడ్డి అన్నారు. బోయల 60 ఏళ్ల కళను కేసీఆర్ సాకారం చేశారన్నారు. గతంలో ఎస్టీలుగా ఉన్న బోయలను బీసీలలో కలిపి గత పాలకులు తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం వెంటనే పార్లమెంట్ ప్రవేశపెట్టి ఆమోదించాలని ఆయన కోరారు.
