హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్ రెడ్డి సమావేశమయ్యారు. శనివారం ఆయన సెక్రటేరియెట్లో సీఎంతో భేటీ అయ్యారు. మక్తల్ నియోజకవర్గంలో మూడు రోజులు వంశీచంద్రెడ్డి పాలమూరు న్యాయ్ యాత్రను చేపట్టారు.
ఓ రోజు విరామం ఇచ్చి సీఎంతో భేటీ అయి తన యాత్ర విశేషాలను పంచుకున్నారు. ఈ సందర్బంగా మహబూబ్నగర్ జిల్లాను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేయాల్సిందిగా సీఎంను వంశీ చంద్రెడ్డి కోరారు. మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాల్లో లక్ష ఎకరాలకు సాగునీరందించే నారాయణపేట–కొడంగల్ఎత్తిపోతల పథకాన్ని త్వరగా మంజూరు చేసి పనులు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.