సీఎం రేవంత్​తో వంశీచంద్​రెడ్డి భేటీ

సీఎం రేవంత్​తో వంశీచంద్​రెడ్డి భేటీ

హైదరాబాద్​, వెలుగు: సీఎం రేవంత్​ రెడ్డితో కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ (సీడబ్ల్యూసీ) ప్రత్యేక ఆహ్వానితుడు వంశీచంద్​ రెడ్డి సమావేశమయ్యారు. శనివారం ఆయన సెక్రటేరియెట్​లో సీఎంతో భేటీ అయ్యారు. మక్తల్​ నియోజకవర్గంలో మూడు రోజులు వంశీచంద్​రెడ్డి పాలమూరు న్యాయ్​ యాత్రను చేపట్టారు.

ఓ రోజు విరామం ఇచ్చి సీఎంతో భేటీ అయి తన యాత్ర విశేషాలను పంచుకున్నారు. ఈ సందర్బంగా మహబూబ్​నగర్​ జిల్లాను అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేయాల్సిందిగా సీఎంను వంశీ చంద్​రెడ్డి కోరారు. మక్తల్​, నారాయణపేట, కొడంగల్​ నియోజకవర్గాల్లో లక్ష ఎకరాలకు సాగునీరందించే నారాయణపేట–కొడంగల్​ఎత్తిపోతల పథకాన్ని త్వరగా మంజూరు చేసి పనులు ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు.