డిసెంబర్‌‌ 14 నుంచి వీరభద్ర స్వామి ఉత్సవాలు

డిసెంబర్‌‌ 14 నుంచి వీరభద్ర స్వామి ఉత్సవాలు

ఖైరతాబాద్, వెలుగు : భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వీధి పళ్లెం మహోత్సవాలు డిసెంబరు 14 నుంచి 17వ తేదీ వరకు సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్స్‌లో నిర్వహించనున్నట్టు సినీనటుడు తనికెళ్ల భరణి తెలిపారు.  సోమాజిగూడ  ప్రెస్​క్లబ్​లో బుధవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..  భద్రకాళి సమేత వీర
భద్ర ఆరాధ్య జనసేవా వాహిని ట్రస్ట్​ఆధ్వర్యంలో 4 రోజుల కార్యక్రమం భారీగా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. 

 ఆయా రోజుల్లో భక్తులకు భోజన సౌకర్యం ఉంటుందన్నారు.  జనసేవా వాహిని ట్రస్ట్ చైర్మన్ ​తాడికొండ విజయ్​కుమార్ ​అధ్యక్షతన జరిగిన సమావేశంలో  రిటైర్ట్​ ఐఏఎస్​ ముక్తేశ్వరరావు, బంగారయ్య శర్మ, కైలాశ్, సుధాకర్​గుప్తా తదితరులు పాల్గొన్నారు.  అనంతరం ఉత్సవాల బ్రోచర్‌‌ను ఆవిష్కరించారు.