బీజేపీలో చేరిన స్మగ్లర్ వీరప్పన్ కూతురు

బీజేపీలో చేరిన స్మగ్లర్ వీరప్పన్ కూతురు

గందపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కూతురు విద్యారాణి బీజేపీలో చేరారు. శనివారం తమిళనాడు కృష్ణగిరిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు, కేంద్ర మాజీ మంత్రి పోన్ రాధాకృష్ణన్ సమక్షంలో ఆమె బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె కుల, మతాలతో సంబంధం లేకుండా పేదలు, నిరుపేదల కోసం పనిచేస్తానన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రవేశ పెట్టిన పథకాలు ప్రజలకు చేరవేసేందుకు కృషి చేస్తానన్నారు. విద్యా రాణితో పాటు ఆమె అనుచరులు 1,000 మంది బీజేపీలో చేరారు. ప్రస్తుతం విద్యారాణి అడ్వకేట్ గా పనిచేస్తున్నారు.