‘వీరసింహారెడ్డి సెకెండ్ సింగిల్‌‌‌‌ను డిసెంబర్ 15న విడుదల

‘వీరసింహారెడ్డి సెకెండ్ సింగిల్‌‌‌‌ను డిసెంబర్ 15న విడుదల

బాలకృష్ణ టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం ‘వీరసింహారెడ్డి’. గాడ్ ఆఫ్ మాసెస్ అనేది ట్యాగ్‌‌‌‌లైన్. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా తెరకెక్కుతోంది. శ్రుతిహాసన్ హీరోయిన్‌‌‌‌గా నటిస్తోంది.ఇప్పటికే రిలీజ్ చేసిన బాలకృష్ణ ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్‌‌‌‌‌‌‌‌తో పాటు ‘జై బాలయ్య’ మాస్ ఆంథమ్ సాంగ్‌‌‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

సెకెండ్ సింగిల్‌‌‌‌ను డిసెంబర్ 15న విడుదల చేయనున్నట్టు ఆదివారం అనౌన్స్ చేశారు. ‘సుగుణ సుందరి’ అంటూ సాగే సాంగ్‌‌‌‌ను రిలీజ్ చేస్తున్నట్టు చెబుతూ, బాలయ్య, శ్రుతిల కొత్త పోస్టర్‌‌‌‌‌‌‌‌ను వదిలారు. ఇందులో ఇద్దరూ  బ్లాక్ కాస్ట్యూమ్స్‌‌‌‌లో మెస్మరైజ్ చేస్తున్నారు. వరలక్ష్మీ శరత్‌‌‌‌కుమార్, దునియా విజయ్ ఇందులో కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.  మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, - వై రవిశంకర్ నిర్మిస్తున్నారు. షూటింగ్ పూర్తిచేసుకుని, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న సినిమా విడుదల కానుంది.