V6 News

సీఎం రేవంత్ రెడ్డి సభను సక్సెస్ చేయాలి : వెలిచాల రాజేందర్రావు

సీఎం రేవంత్ రెడ్డి సభను సక్సెస్ చేయాలి : వెలిచాల రాజేందర్రావు

కరీంనగర్, వెలుగు: ఈ నెల 20న కాటారంలో సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యే భారీ బహిరంగ సభకు కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌చార్జి వెలిచాల రాజేందర్ రావు పిలుపునిచ్చారు.

శనివారం వెలిచాల రాజేందర్ రావు మీడియాతో మాట్లాడుతూ రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి గత బీఆర్ఎస్ పాలకులు కాళేశ్వరం ప్రాజెక్టును నాసిరకంగా కట్టారని మండిపడ్డారు. 200 వాహనాల ద్వారా కార్యకర్తలు, నాయకులను తరలించేందుకు సమాయత్తమవుతున్నట్లు రాజేందర్ రావు వెల్లడించారు.