వెలుగు క్రికెట్ టోర్నీ ఫైనల్ వాయిదా

వెలుగు క్రికెట్ టోర్నీ ఫైనల్ వాయిదా

దేశ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితుల కారణంగా.. వెలుగు వీ6 ట్వంటీ20 క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ వాయిదా పడింది. గత నెలరోజుల నుంచి తెలంగాణ అన్ని జిల్లాల్లో వెలుగు దిన పత్రిక ఆధ్వర్యంలో క్రికెట్ మ్యాచ్ లు నిర్వహించారు. అయితే ఈ రోజు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిజామాబాద్ అర్బన్, మహబూబ్ నగర్ జట్ల మధ్య జరగాల్సిన ఫైనల్ మ్యాచ్ ను పోస్ట్ పోన్ చేశారు. మ్యాచ్ ను మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తామన్నది త్వరలోనే ప్రకటిస్తామన్నారు టోర్నీ డైరెక్టర్ వరుణ్. ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్ లు విజయవంతం చేసిన అందరికీ కృతజ్ఞతలు చెప్పారు. సైనికులకు అండగా ఉండాల్సిన బాధ్యత ప్రతీ ఒక్క భారతీయుడిపై ఉందన్నారు వరుణ్.