విద్య, ఉద్యోగ నోటిఫికేషన్ల ఫీజుల్లో రాయితీ  కల్పించాలి : వేముల రామకృష్ణ

విద్య, ఉద్యోగ నోటిఫికేషన్ల ఫీజుల్లో రాయితీ  కల్పించాలి :  వేముల రామకృష్ణ

ముషీరాబాద్,వెలుగు: విద్య, ఉద్యోగ నోటిఫికేషన్లలో ఎస్సీ, ఎస్టీల మాదిరిగా బీసీలకు కూడా దరఖాస్తు ఫీజులో రాయితీ కల్పించాలని బీసీ విద్యార్థి సేన రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ డిమాండ్ చేశారు. ఆదివారం విద్యానగర్ బీసీ భవన్ లో విద్యార్థి సంఘాల సమావేశం జరిగింది. ఇందులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... ఏడేండ్ల కిందట నిర్ణయించిన ధరలనే ఇప్పటికీ ఇస్తుండగా.. సంక్షేమ హాస్టల్లో నాణ్యమైన ఫుడ్ విద్యార్థులకు ఏ విధంగా అందుతుందో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వాలు మారుతున్నా సంక్షేమ హాస్టళ్లను మాత్రం పాలకులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా  అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయని, ఒక్కొక్క గదిలో పదుల సంఖ్యలో విద్యార్థులు ఉండడం దారుణమన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కార సాధనకు త్వరలో రాష్ట్ర వ్యాప్త పర్యటన చేపడుతున్నామని తెలిపారు.