కామారెడ్డి ఆలయాలకు ఎములాడ, యాదాద్రి నిధులు

కామారెడ్డి ఆలయాలకు ఎములాడ, యాదాద్రి నిధులు
  •  ఫండ్స్ విడుదల ఆర్డర్స్​ నిలిపివేత 
  •   ఉత్తర్వులు జారీ చేసిన ఎండోమెంట్​ 

వేములవాడ, వెలుగు: వేములవాడ రాజన్న ఆలయంతో పాటు యాదాద్రి లక్ష్మీనర్సింహ స్వామి టెంపుల్​నుంచి కామారెడ్డి నియోజకవర్గంలోని గుడులకు నిధుల మళ్లిస్తూ తీసుకున్న నిర్ణయంపై సర్కారు వెనక్కి తగ్గింది. వేములవాడ గుడికి సంవత్సరానికి రూ.100 కోట్లు ఇస్తామని చెప్పి, అవి ఇవ్వకుండా రాజన్న ఆలయం నుంచి కామారెడ్డి నియోజకవర్గంలోని టెంపుల్స్​కు నిధులు ఇవ్వాలని ఉత్తర్వులు జారీ చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కాంగ్రెస్​, బీజేపీ, సీపీఐ, సీపీఎం, బీఎస్పీ, ఇతర పార్టీల లీడర్లు అఖిలపక్షంగా ఏర్పడి ఆందోళనలు చేయడంతో పాటు శనివారం వేములవాడ పట్టణ బంద్​కు పిలుపునివ్వడంతో ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికలు వస్తున్న తరుణంలో ఇది తమ కొంప ముంచుతుందని భావించిన బీఆర్ఎస్​సర్కారు ఫండ్స్ విడుదల ఆర్డర్స్​నిలిపివేసింది. 

కామారెడ్డి నియోజకవర్గంలోని దేవాలయాల అభివృద్ధికి ఎండోమెంట్​సీజీఎఫ్​(కామన్​గుడ్​ ఫండ్​) నుంచి రూ.10 కోట్లు వినియోగించుకుంటున్నట్లు శుక్రవారం రాత్రి ఎండోమెంట్ డిపార్ట్​మెంట్​ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో శనివారం నాటి బంద్​ ను విరవించుకున్నట్లు వేములవాడ జేఏసీ కన్వీనర్​నేరేళ్ల తిరుమల్​గౌడ్​, కాంగ్రెస్​ పార్టీ జిల్లా అధ్యక్షుడు అది శ్రీనివాస్​, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ ప్రకటించారు. మరోసారి ఇలాంటి జిమ్మిక్కులు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.