వేం నరేందర్ రెడ్డికి సన్మానం

వేం నరేందర్ రెడ్డికి సన్మానం

గండిపేట, వెలుగు: తెలంగాణ నుంచి రాజ్యసభకు నామినేట్ అయిన సందర్భంగా ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్​రెడ్డిని చేవెళ్ల మాజీ ఎంపీ గడ్డం రంజిత్​రెడ్డి ఆధ్వర్యంలో నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. నార్సింగి సర్కిల్ మణికొండ 127, 128 డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు జితేందర్, కిరణ్​కుమార్, షేక్ హాజీ, శ్రీధర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని నరేందర్​రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.