మురళీ మోహన్‌కు వెంకయ్య, చంద్రబాబు పరామర్శ

మురళీ మోహన్‌కు వెంకయ్య, చంద్రబాబు పరామర్శ

వెన్నుకు శస్త్రచికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న రాజమహేంద్రవరం మాజీ పార్లమెంట్ సభ్యుడు మాగంటి మురళీమోహన్ ను  ఆయన ఇంట్లో పరామర్శించారు ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్. ఆయన యోగ క్షేమాలను అడిగి తెల్సుకున్నారు. మురళీ మోహన్ కుటుంబసభ్యులతో ముచ్చటించారు.

మురళీమోహన్ ను ఫోన్ లైన్ లో పరామర్శించారు ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెల్సుకున్నారు. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని మురళీమోహన్ కు సూచించారు వెంకయ్య.