
హైదరాబాద్: పాక్, పీవోకేలోని టెర్రరిస్టు స్థావరాలను ధ్వంసం చేసిన సైనికులకు సెల్యూట్ చేస్తున్నానని భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. పహల్గాం టెర్రరిస్ట్ ఎటాక్కు ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ గ్రాండ్ సక్సెస్ అయిన నేపథ్యంలో దేశవ్యాప్తంగా తిరంగా విజయ యాత్ర చేపట్టాని బీజేపీ పిలుపునిచ్చింది. హై కమాండ్ పిలుపు మేరకు తెలంగాణ బీజేపీ యూనిట్ శనివారం (మే 17) హైదరాబాద్లో తిరంగా యాత్ర చేపట్టింది.
ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం నుంచి స్వామీ వివేకానంద స్టాట్య్చూ వరకు భారీ ర్యాలీ తీశారు. ఈ ర్యాలీకి హాజరైన వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. మనది శాంతి కోరుకునే దేశమని.. భారత్ ఎప్పుడూ ఏ దేశం మీద ముందుగా దాడి చేయలేదని అన్నారు. పాక్తో ఉద్రిక్తతల వేళ ప్రధాని మోడీ ప్రదర్శించిన సమయస్పూర్తిని మెచ్చుకోవాలన్నారు. దేశ అంతర్గత భద్రతకు ముప్పు వాటిల్లితే ప్రజలు కుల, మత, భాష, ప్రాంతాలకు అతీతంగా ఉండాలని కోరారు.
►ALSO READ | కేటీఆర్ ఫారిన్ వెళ్లగానే.. బీఆర్ఎస్ ఎల్పీ చీలిక: బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
పొరుగు దేశం పాకిస్తాన్తో స్నేహంగా ఉండేందుకు ప్రయత్నం చేశాం.. కానీ దాయాది దేశం ఉగ్రవాదులను పెంచి పోషిస్తూ భారత్ పై దాడులకు ఉసిగొల్పుతోందని ఫైర్ అయ్యారు. పాకిస్తాన్తో చర్చ జరపాలి అంటే అది కేవలం ఆక్రమిత కశ్మీర్, ఉగ్రవాదంపైన మాత్రమే జరగాలన్నారు. కాశ్మీర్ అంశంలో భారత్కు ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని తేల్చి చెప్పారు.