హీరో విక్టరీ వెంకటేష్ (Venkatesh) నటించిన సైంధవ్(Saindhav) మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 13న రిలీజై ఆడియాన్స్ను ఆకట్టుకుంది. ఈ సినిమాలో వెంకటేష్ యాక్షన్, ఎమోషన్స్కు ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు. కానీ, బాక్సాపీస్ వసూళ్ళలో మేకర్స్ అనుకున్నంత స్థాయిలో సైంధవ్ రీచ్ అవ్వలేకపోయింది.
భారీ అంచనాలతో వెంకటేష్ కెరీర్ మైల్ స్టోన్ 75వ మూవీగా థియేటర్లలో రిలీజైన సైంధవ్..నెల రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. వచ్చే నెల ఫిబ్రవరి 9న రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో సైంధవ్ ఓటీటీ రిలీజ్ డేట్ను మేకర్స్ ప్రకటించే అవకాశం ఉంది. కాగా సైంధవ్ శాటిలైట్ హక్కులను ఈటీవీ దక్కించుకున్నట్లు సమాచారం.
ముందుగా ఈ సినిమాని ఫిబ్రవరి లాస్ట్ వీక్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు వార్తలు రాగా..థియేటర్లలో ఆశించిన స్థాయిలో సైంధవ్ లేకపోవడంతో ఫిబ్రవరి 9న రిలీజ్ చేసే అవకాశం కనిపిస్తోంది.
అలాగే మహేష్ బాబు గుంటూరు కారం మూవీ కూడా ఫిబ్రవరి 9న ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో థియేటర్లోనే కాదు..ఓటీటీలోను..చిన్నోడు పెద్దోడు పోటీలో నిలిచేలా ఉన్నారు.