జేఎన్టీయూ ఇన్ చార్జి రిజిస్ట్రార్ గా వెంకటేశ్వరరావు

జేఎన్టీయూ ఇన్ చార్జి రిజిస్ట్రార్ గా వెంకటేశ్వరరావు

జేఎన్టీయూ, వెలుగు: కూకట్ పల్లి జేఎన్టీయూ ఇన్ చార్జి రిజిస్ట్రార్ గా డైరెక్టరేట్ ఆఫ్ యూనివర్సిటీ ఎగ్జామ్స్ డైరెక్టర్ డాక్టర్ కె. వెంకటేశ్వరరావుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు బుధవారం జేఎన్టీయూ వీసీ కట్టా నర్సింహా రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. జేఎన్టీయూ రిజిస్ట్రార్ మంజూర్​ హుస్సేన్ బుధవారం రిటైర్మెంట్ పొందారు. ఆయన స్థానంలో వెంకటేశ్వరరావుకు ఇన్​చార్జి రిజిస్ట్రార్​గా బాధ్యతలు అప్పగించారు. వెంకటేశ్వరరావు గతంలో ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, నానో టెక్నాలజీ ప్రొఫెసర్ గా, డిపార్ట్ మెంట్ హెడ్ గా పనిచేసిన అనుభవం ఉంది