'గుంతలకడి గురునాథం'గా వెన్నెల కిషోర్

'గుంతలకడి గురునాథం'గా వెన్నెల కిషోర్

టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్ ప్రస్తుతం 'మాచర్ల నియోజకవర్గం' చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో నితిన్ కు జోడీగా ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి అలరించనుంది. కేథరిన్ ట్రెసా మరో హీరోయిన్ గా నటిస్తోంది. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ చివరి పాట మినహా షూటింగ్ పార్ట్ మొత్తం పూర్తి చేసుకుంది. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆగస్ట్ 12న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదల కానున్నది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్స్ జోరు పెంచారు. 

తాజాగా ఈ సినిమా నుంచి వెన్నెల కిషోర్ పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేశారు. 'గుంతలకడి గురునాథం' అనే ఆయన పాత్ర పేరును పరిచయం చేస్తూ ఈ పోస్టర్ ను వదిలారు. 'ఈగో కా బాప్' అంటూ ఆయనలో ఈగో ఏ రేంజ్ లో ఉండనుందో తెలుస్తోంది.. అందుకు తగినట్టుగానే పోస్టర్ లో కిషోర్ ఎక్స్ ప్రెషన్ ఉంది. ఇక ఈ సినిమాలో నితిన్ ఐఏయస్ పాత్రలో కనిపించబోతున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సినిమా ఫస్ట్ హాఫ్ రీరికార్డింగ్ వర్క్ పూర్తయింది.