గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద విజయశాంతి నివాళి

గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద విజయశాంతి నివాళి

రాజకీయాల్లోకి వచ్చి 25 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా నాంపల్లి గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద బీజేపీ నాయకురాలు విజయశాంతి నివాళులర్పించారు. ప్రముఖ సినీ నటి, మాజీ ఎంపీ విజయశాంతి రాజకీయాల్లోకి ప్రవేశించి 25 సంవత్సరాలు పూర్తయ్యాయి. 1998 జనవరి 26న రాజకీయాల్లోకి వచ్చిన ఆమె.. మొదట్లో బీజేపీలో చేరారు. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం ఊపందుకోవడంతో బీజేపీ నుంచి తప్పుకుని 2005లో తల్లి తెలంగాణ పార్టీ ఏర్పాటు చేశారు. ఆ తర్వాత నాలుగేళ్లకు తన పార్టీని టీఆర్ఎస్ లో కలిపేశారు. 2009 ఎన్నికల్లో మెదక్ పార్లమెంటు స్థానం నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసి, గెలిచి ఎంపీ అయ్యారు. కొన్ని ప్రతికూల పరిణామాలతో ఆమె టీఆర్ఎస్ పార్టీకి దూరమయ్యారు. 2014లో కాంగ్రెస్ లో చేరిన విజయశాంతి... అక్కడా ఇమడలేకపోయారు. 2020లో విజయశాంతి మళ్లీ బీజేపీ గూటికే చేరారు.