లడఖ్​లో అరుదైన జంతువు.. 

లడఖ్​లో అరుదైన జంతువు.. 

లడఖ్​ : వచ్చింది పిల్లి  అనుకొని.. కుక్కలు ఆగకుండా అరిచాయి.  దానిచుట్టూ మూగేందుకు ప్రయత్నించాయి. అయితే అచ్చం పిల్లిలా ఉన్న ఆ జంతువు ధైర్యంగా అక్కడే కూర్చుంది. దీంతో కుక్కలన్నీ తోక ముడిచాయి. ఈ వీడియోను ఇండియన్​ ఫారెస్ట్​ ఆఫీసర్​ పర్వీన్​ కశ్వాన్​ బుధవారం ట్విట్టర్​లో పోస్ట్​ చేయడంతో వైరల్​గా మారింది.  ఈ వీడియో క్రెడిట్ ను లడఖ్​కు చెందిన గాయకురాలు షిరీన్ ఫాతిమాకు ఇచ్చారు. ఆమె పోస్ట్​చేసిన వీడియోనే తాను డౌన్​లోడ్​ చేసుకొని రీపోస్ట్​ చేశానని ఆయన​ తెలిపారు. ‘‘వీడియోలో కనిపిస్తున్న జంతువేదో చెప్పుకోండి చూద్దాం’’  అంటూ నెటిజన్లకు ఆయన సరదా ప్రశ్న వేశారు. దీంతో ఎంతోమంది తమకు తోచిన ఆన్సర్స్​ ఇచ్చారు. కొన్ని గంటల్లోనే వేలాదిగా లైక్స్​ వచ్చాయి.  ఈ పోస్ట్​ చేసిన  9 గంటల తర్వాత అది ఏ జంతువనే దానిపై క్లారిటీ ఇస్తూ పర్వీన్​ ట్విట్టర్​లో  మరో పోస్ట్​ చేశారు. వీడియోలో కనిపిస్తున్నది ‘హిమాలయన్​ లింక్స్’గా పిలిచే అడవి పిల్లి అని వెల్లడించారు. పొడవాటి చెవులు, పిల్లి కంటే పెద్ద శరీరాకృతి దీని ప్రత్యేక లక్షణాలని తెలిపారు.