ఆ ఎమ్మెల్యేలను ప్రగతిభవన్​లో ఎందుకు దాచినవ్ ​: విజయశాంతి

ఆ ఎమ్మెల్యేలను ప్రగతిభవన్​లో ఎందుకు దాచినవ్ ​: విజయశాంతి

హైదరాబాద్, వెలుగు: చండూరు పబ్లిక్ మీటింగ్​లో సీఎం కేసీఆర్ మాట్లాడినవన్నీ అబద్ధాలేనని బీజేపీ సీనియర్ నేత విజయశాంతి మండిపడ్డారు. మోటార్లకు మీటర్లంటూ ప్రతిరోజూ అబద్ధం చెబుతున్నారంటూ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. “ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు. మీరు కుట్ర చేసి నడిపించబట్టే... ఆ నలుగురు ఎమ్మెల్యేలను బయటకు వదిలే ధైర్యం లేక కోడి పిల్లలను బుట్టల పెట్టినట్లు ప్రగతిభవన్‌‌‌‌ల దాచిపెట్టి ప్రజలను మోసం చేస్తున్నరు.

ఆ నలుగురు ఎమ్మెల్యేలలో ఒకరు సంఘటన జరిగిన నాడే.. మేమంతా కేసీఆర్ చెప్పినట్టే చేసినమని ప్రెస్ ముందు చెప్పింది నిజం కాదా? నిజాయితీపరులు అని మీరే చెబుతున్న ఆ నలుగురు ఎమ్మెల్యేలనూ 4  రోజుల నుంచి నిర్బంధించాల్సిన అగత్యం ఏంటి? వారు నిజం బయట పెడతారనేనా ? బైపోల్ లోపు వారు ప్రగతిభవన్ కట్టడి నుంచి బయటకు రాగలిగే అవకాశం మీ నియంతృత్వ పాలనలో ఉందా లేదా ’’ అని విజయశాంతి ప్రశ్నించారు.