నేను ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేశా.. నా కన్నా కేసీఆర్ పెద్దనటుడు

నేను ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేశా.. నా కన్నా కేసీఆర్ పెద్దనటుడు

నేను ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేశా..నా కన్నా పెద్దనటుడంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్రస్థాయిలో విరుచుకుడింది రాములమ్మ. బీజేపీ ఆఫీస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన విజయశాంతి.., తల్లి తెలంగాణ పార్టీని.. టీఆర్ఎస్ లో విలీనం చేసేలా కేసీఆర్ కుట్రలు చేశారని ఆరోపించారు.

కేసీఆర్ నమ్మక ద్రోహి.. అందుతే జుట్టు, లేకపోతే కాల్లు పట్టుకుంటారు.కుట్రలు చేయడంలో, అవమానిచడం లో నెంబర్ వన్. అమరవీరుల శవాలపై కూర్చుని కేసీఆర్ పాలన చేస్తున్నారన్న విజయశాంతి.. కేసీఆర్ కు తెలంగాణ ప్రజల కంటే.. డబ్బు మీదనే ఎక్కువ ప్రేమ అని అన్నారు. రాఖీ కట్టిన చెల్లెళ్ళకు ఒకప్పుడు లక్ష రూపాయలు ఇవ్వలేని కేసీఆర్ కు లక్ష కోట్లు ఎలా వచ్చాయి?  ఈ డబ్బంతా తెలంగాణా ప్రజలది కాదా..? అని ప్రశ్నించారు. కేసీఆర్ ఆక్రమ సంపాదనను తెలంగాణా ప్రజలకు పంచాలని డిమాండ్ చేశారు. డల్లాస్ చేస్తా, సింగపూర్ ను చేస్తానని మాయమాటలు చేసిన కేసీఆర్ తెలంగాణకు ఏం ఇచ్చారో చెప్పాలన్నారు.

రెండుసార్లు అవకాశం ఇచ్చాం. తెలంగాణ ప్రజలు అమాయకులు కదా..ఇంక మాకు ఓపికలేదు. ఆరేళ్లలో ఏం చేశారు. ప్రత్యేక రాష్ట్రం, తెలంగాణ అభివృద్ధి ఇదే కదా మనకు కావాల్సింది. మరి ప్రజలకు కేసీఆర్ ఏం చేస్తున్నారు. పైన దేవుడు ఉన్నాడు.

తెలంగాణలో తాను తప్ప ఇతర పార్టీలు, నేతలు ఉండకూదని కుట్ర చేశారు. కానీ బీజేపీ ఉంది. కేసీఆర్ పాపం పండింది. మంచి చేసేవాళ్లు ఇబ్బంది పడుతుంటే ..దేవుడు వాళ్లకి చేయందించి కాపాడుతాడు. పాపాలు చేసే కేసీఆర్ లాంటి వాళ్లని దేవుడు చూసి చూసి చివరికి కేసీఆర్ కి కూడా అదే గతిపడుతుందంటూ తమిళ్ బాషా సినిమాలోని రజిని కాంత్ డైలాగ్ తో విజయశాంతి అలరించారు.