ఏనాడు ఏ పదవి కోరుకోలేదు.. 25 ఏళ్ల పొలిటికల్ జర్నీపై విజయశాంతి భావోద్వేగం

ఏనాడు ఏ పదవి కోరుకోలేదు.. 25 ఏళ్ల పొలిటికల్ జర్నీపై విజయశాంతి భావోద్వేగం

బీజేపీ నాయకురాలు విజయశాంతి తన 25 ఏళ్ల పొలిటికల్ జర్నీపై ఆసక్తికర్ ట్వీట్ చేశారు. తాను ఏనాడు పదవి కోరుకోలేదని..ఇపుడు కూడా కోరుకోవడం లేదన్నారు.  25 సంవత్సరాల తన  రాజకీయ ప్రయాణం .. అప్పుడు ఇప్పుడు కూడా ఎందుకో సంఘర్షణే ఇచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.  అయితే ప్రస్తుతం ఇది తెలంగాణ బిడ్డలకు చెప్పాల్సిన సత్యమని చెప్పారు. 

మన పోరాటం నాడు దశాబ్ధాల ముందు తెలంగాణ ఉద్యమ బాట నడిచినప్పుడు, మొత్తం అందరు తెలంగాణ బిడ్డల సంక్షేమం తప్ప, ఇయ్యాల్టి  బీఆర్ఎస్ కు వ్యతిరేకం అవుదామని కాదన్నారు. తన పోరాటం నేడు కేసీఆర్  కుటుంబ దోపిడి, కొందరు బీఆర్ఎస్ నేతల అరాచకత్వం పై తప్ప..తనతో కలిసి తెలంగాణా ఉద్యమంలో ప్రాణం అడ్డుపెట్టి పనిచేసిన  బీఆర్ఎస్ కార్యకర్తలపై మాత్రం కాదని తెలిపారు. రాజకీయ పరంగా  విభేదించినప్పటీకి.. అన్ని పార్టీల మొత్తం తెలంగాణ బిడ్డలు సంతోషంగా, సగౌరవంగా ఎన్నటికే ఉండాలనీ మనస్పూర్తిగా  కోరుకోవటమే తన ఉద్దేశ్యమని అన్నారు.

గత కొన్ని రోజులుగా విజయశాంతి రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.బీజేపీతో తగిన ప్రాధాన్యత దక్కడం లేదని..  ఆమె పార్టీ మారుతారనే ప్రచారంకూడా జరిగింది. దీంతో  ఆమెకు తెలంగాణ బీజేపీ నిరసనల కమిటీ ఛైర్మన్ పదవి ఇచ్చిన సంగతి తెలిసిందే.