బీజేపీపై వ్యతిరేక ప్రచారం నిల్వదు.. హరీశ్ కు విజయశాంతి కౌంటర్  

బీజేపీపై వ్యతిరేక ప్రచారం నిల్వదు.. హరీశ్ కు విజయశాంతి కౌంటర్  

హైదరాబాద్, వెలుగు: బీజేపీని నిరం తరం గెలిపిస్తున్నది కార్యకర్తల త్యాగాలేనని ఆ పార్టీ నేత విజయ శాంతి అన్నారు. రక్తమిచ్చే హైందవ ధర్మశ్రేణుల పోరాటాలే పార్టీని నిలబెడుతున్నాయని ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటనలో ఆమె పేర్కొన్నారు. బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ చేతులెత్తేశారని, ఇక చేరికలు లేవంటూ మంత్రి హరీశ్ రావు చేసిన కామెంట్లపై విజయశాంతి స్పందించారు. ‘‘నాటి దుబ్బాక, జీహెచ్ఎంసీ, నిన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు చేరికలతో వచ్చాయా? చేరికల కమిటీతో వచ్చాయా?” అని ప్రశ్నించారు.