Prithviraj: నటుడు పృథ్వీరాజ్‌కు షాక్.. అరెస్ట్ వారెంట్‌ ఇష్యూ చేసిన కోర్టు

Prithviraj: నటుడు పృథ్వీరాజ్‌కు షాక్.. అరెస్ట్ వారెంట్‌ ఇష్యూ చేసిన కోర్టు

నటుడు పృథ్వీరాజ్‌(Prithviraj)కు విజయవాడ కోర్టు షాకిచ్చింది. ఆయనపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను ఇష్యూ చేసింది. కొన్నేళ్ల క్రితం పృథ్వీరాజ్‌ తన భార్య శ్రీలక్ష్మితో విడిపోయిన విషయం తెలిసిందే. ఆ సమయంలో కోర్టు తన భార్యకు ప్రతి నెల భరణం చెల్లించాలని ఆదేశించింది. ఈ ఆదేశాలను పృథ్వీరాజ్‌ పాటించకపోవడం, కోర్టుకు హాజరు కాకపోవడంతో ఆయనకి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసినట్లు తెలుస్తుంది.

ఇక నటుడు పృథ్వీరాజ్‌ విషయానికి వస్తే.. 1984లో ఆయన శ్రీలక్ష్మిని వివాహం చేసుకున్నారు. వారికీ  ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆ తరువాత కొంతకాలానికి ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో.. విడాకులు తీసుకొని వేరుగా ఉంటున్నారు. శ్రీలక్ష్మీ పిల్లలతో కలిసి తన పుట్టింట్లో ఉంటుండగా.. పృథ్వీరాజ్‌ విజయవాడలో తన అమ్మవాళ్ల ఇంట్లో ఉంటున్నాడు. ఇక విడాకుల సమయంలో కోర్టు ప్రతీ నెల రూ.8 లక్షల రూపాయలు భార్య శ్రీలక్ష్మికి చెల్లించాలని  పృథ్వీరాజ్‌ ను ఆదేశించింది. అయితే.. కొంతకాలంగా పృథ్వీరాజ్‌ నెల నెల భరణాన్ని చెల్లించకపోడంతో.. విజయవాడ కోర్టు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను ఇష్యూ చేసింది.