వికారాబాద్ జిల్లాలో విషాదం నింపిన ఈత సరదా.. కాగ్నా నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు యువకులు

వికారాబాద్ జిల్లాలో విషాదం నింపిన ఈత సరదా.. కాగ్నా నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు యువకులు
  • మృతదేహాలను చూసిన కుటుంబసభ్యుడు గుండెపోటుతో మృతి

తాండూరు, వెలుగు: ఈత సరదా ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. ఇద్దరు యువకులు నీటమునిగి చనిపోగా.. వారి మృతదేహాలను చూసిన మరో వ్యక్తి గుండెపోటుతో మృతిచెందాడు. ముగ్గురి మృతితో కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. 

వికారాబాద్​ జిల్లా పాత తాండూరుకు చెందిన మొహిజొద్దీన్(28), అతనికి వరుసకు బాబాయ్​అయిన కోహీర్​ప్రాంతానికి చెందిన రహమత్(26) ఆటోడ్రైవర్లు. బుధవారం బంధువుల ఫంక్షన్​లో కలిసి, సాయంత్రం ఈత కొట్టేందుకు యాలాల్​మండలం కోకట్ గ్రామ సమీపంలోని కాగ్నా నదికి వెళ్లారు. నీటిలో దిగిన కాసేపటికే ఇద్దరూ మునిగిపోయారు.

 పోలీసులు గజ ఈతగాళ్లను పిలిపించి, గాలించగా మొహిజొద్దీన్​మృతదేహం లభ్యమైంది. గురువారం మళ్లీ గాలించగా రహమత్​డెడ్​బాడీ దొరికింది. తాండూరు ప్రభుత్వ ఆస్పత్రిలో వీరి మృతదేహాలను చూసిన మొహిజొద్దీన్​కు మేనమామ, రహమత్ కు​బావ అయిన సాజిద్(46) గుండెపోటుతో మృతిచెందాడు. సాజిద్​భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై విఠల్ రెడ్డి తెలుపారు.