వికారాబాద్‌లో వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ..

వికారాబాద్‌లో వీడిన మహిళ హత్య కేసు మిస్టరీ..

వికారాబాద్‌ జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపిన మహిళ హత్య కేసులో మిస్టరీ వీడింది. మహిళను అటవీ ప్రాంతంలో మెడకు చీర కొంగు బిగించిన చంపి.. పెట్రోల్ పోసి తగలబెట్టాడు హంతకుడు. మృతురాలు చేవెళ్లకు చెందిన అనసూయగా గుర్తించారు. నిందితుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 

నాలుగురోజు క్రితం(జనవరి 15) వికారాబాద్ జిల్లా చేవెళ్లకు చెందిన అనసూయ అనే మహిళను హత్య జరిగింది. అటవీ ప్రాంతంలో మెడకు కొంగు బిగించి చంపి.. పెట్రోల్ పోసి తగలబెట్టాడు హతంకుడు. ఈ కేసులో నిందితుడు బాబు అని తేల్చారు. అనసూయను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి హత్య చేశాడని.. ఆ తర్వాత కాళ్ల కడియాలు, చెవి దిద్దులను బాబు ఎత్తుకెళ్లాడని తెలిపారు. బాబుతో అనసూయకు వివాహేతర సంబంధం ఉందని చెప్పారు. నిందితుని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బాబుపై గతంలో పలు కేసులు నమోదు అయ్యాయని వివరించారు. 

కాగా ఈ హత్య కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. హంతకుడు బాబు అలియాస్ రామస్వామి ఒక సీరియల్ కిల్లర్ అని పోలీసులు తెలిపారు. ఇప్పటికే రామస్వామిపై 5 హత్య కేసులు ఉన్నాయని... ఒంటరి మహిలే అతని టార్గెట్ అని.. మాయమాటలతో నమ్మించి అక్రమ సంబంధం పెట్టుకోని కొన్నిరోజుల పాటు ఆ మహిళతో ఉండి ఆ తర్వాత వారిపై హత్యకు  రామస్వామి పాల్పడుతాడని పేర్కొన్నారు. ఇదే తరహాలో ఐదుగురు మహిళలను రామస్వామి హత్య చేసినట్లు తేల్చారు. గతంలో రామస్వామి ఓ మహిళ తల నరికి... తల, మొండెం వేర్వేరుగా పాతిపెట్టాడని చెప్పారు.