
వికారాబాద్, వెలుగు: వికారాబాద్ జిల్లా యాలాల జడ్పీ స్కూల్సైన్స్ టీచర్ కాశీంబిని డీఈఓ సస్పెండ్చేశారు. టెన్త్క్లాస్ స్టూడెంట్స్కు ఆమె మంగళవారం ఆవు మెదడును ప్లేట్లో పెట్టి ప్రత్యక్షంగా చూపిస్తూ పాఠం బోధించారు. బ్రెయిన్ ఇలా ఉంటుందని స్టూడెంట్స్తో కలిసి ఫొటోలు దిగారు.
ఈ ఘటనపై బీజేపీ, ఏబీవీపీ, హిందూ సంఘాల నాయకులు బుధవారం స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు. సదరు టీచర్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో మండల విద్యాధికారి రమేశ్ విచారణ చేసి నివేదిక సమర్పించగా, సదరు టీచర్ను డీఈఓ రేణుకా దేవి బుధవారం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.