విక్రమ్ హీరోగా గౌతమ్ మీనన్ దర్శకనిర్మాతగా రూపొందించిన చిత్రం ‘ధృవ నక్షత్రం’. రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ యుద్ధకాండం పేరుతో నవంబర్ 24న విడుదలవుతోంది. గురువారం ట్రైలర్ను రిలీజ్ చేశారు. ముంబైపై టెర్రరిస్ట్ దాడి జరిగినప్పుడు అప్పటి ఎన్ఎస్జీ టీమ్లో ఉన్న ఓ సీనియర్ ఆఫీసర్ తమ వృత్తిలోని సవాళ్లను గురించి మరో వ్యక్తికి చెబుతుంటాడు.
చట్టంలోని రూల్స్ రెగ్యులేషన్స్ ఉగ్రవాదులను ఎదుర్కోవడంలో తమకు అడ్డుగా మారుతున్నాయని, అందుకే చట్టంతో పనిలేని బేస్మెంట్ అనే ఓ కోవర్ట్ టీమ్ను తయారు చేసినట్లు ఆ సీనియర్ ఆఫీసర్ వెల్లడిస్తాడు. క్రికెట్ టీమ్లా 11 మంది ఉండే టీమ్లోకి స్పెషలిస్ట్ ఆఫీసర్గా వస్తాడు (విక్రమ్) జాన్ . ఈ కోవర్ట్ టీమ్ తరపున టెర్రరిస్టులతో జాన్ చేసే పోరాటాన్ని ట్రైలర్లో ఆసక్తికరంగా చూపించారు. రీతూ వర్మ హీరోయిన్గా నటించిన చిత్రంలో ఐశ్వర్య రాజేష్, పార్తిబన్, రాధిక, సిమ్రాన్, వినాయకన్ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.