తనుగుల సర్పంచ్, ఎంపీటీసీపై ప్రజావాణిలో ఫిర్యాదు

తనుగుల సర్పంచ్, ఎంపీటీసీపై ప్రజావాణిలో ఫిర్యాదు

కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించే ప్రజా వాణికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. జమ్మికుంట మండలం తనుగుల గ్రామస్థులు సర్పంచ్ రామస్వామి, ఎంపిటీసీ నిరోషాలపై ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. వీరిద్దరూ కలిసి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని పేర్కొన్నారు. 

తనుగుల గ్రామంలోని 169/A సర్వే నెంబర్ లో దళితుల నివాసం కోసం కేటాయించిన 3.31 ఎకరాల స్థలాన్ని  కొందరు అక్రమార్కులు కబ్జా చేశారని తెలిపారు. వారిని అడ్డుకునేందుకు ఎలాంటి ప్రయత్నం చేయకపోగా..వారికి సర్పంచ్, ఎంపీటీసీ సహకరిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు స్పందించి సదరు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు. 

కలెక్టరేట్ లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణికి ఫిర్యాదులు వస్తున్నాయి.  చాలా కాలం తర్వాత అధికారులను ప్రత్యక్షంగా కలిసి సమస్యలు చెప్పుకునే అవకాశం రావడంతో పెద్ద ఎత్తున జనాలు తరలి వస్తున్నారు. మారుమూల ప్రాంతాల నుంచి  జిల్లా కేంద్రానికి చేరుకొని దరఖాస్తు చేసుకుంటున్నారు.