మా గ్రామాలకు రోడ్డు వేయండి... హైవేపై పలు గ్రామస్తుల ఆందోళన

మా గ్రామాలకు రోడ్డు వేయండి... హైవేపై పలు గ్రామస్తుల ఆందోళన

పరిగి, వెలుగు: తమ గ్రామాలకు రోడ్డు వేయాలని పరిగిలోని హైదరాబాద్ – బీజాపూర్ హైవేపై ఆయా గ్రామస్తులు ఆందోళనకు దిగారు. శుక్రవారం ఉదయం మండల పరిధిలోని సుల్తాన్ నగర్, ఎర్రగడ్డ పల్లి, నారాయణపూర్, లక్షిదేవిపల్లి గ్రామాలకు చెందిన ప్రజలు జేసీబీని అడ్డుపెట్టి హైవేను బ్లాక్ చేశారు. 

ఎప్పుడో 20 ఏండ్ల కింద ఎర్రగడ్డ పల్లికి రోడ్డు వేశారని, ప్రస్తుతం అది గుంతలమయంగా మారిందన్నారు. ప్రయాణానికి అనుకూలంగా లేక నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ఇప్పటికైనా ఆఫీసర్లు, ప్రజా ప్రతినిధులు తమ సమస్యను గుర్తించి రోడ్డు నిర్మించాలని కోరారు. సమాచారం అందుకున్న పరిగి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని, గ్రామస్తులతో చర్చించి ఆందోళనను విరమింపజేశారు.