కేసీఆర్ దత్తత గ్రామంలో TRS నేతలపై తిరగబడ్డ గ్రామస్తులు

కేసీఆర్ దత్తత గ్రామంలో TRS నేతలపై తిరగబడ్డ గ్రామస్తులు

కరీంనగర్ జిల్లాలోని సీఎం కేసీఆర్ దత్తత గ్రామం చినముల్కనూరులో TRS నేతలపై తిరగబడ్డారు గ్రామస్తులు. చినముల్కనూరులో ఈ మధ్యే కాంగ్రెస్ పార్టీ దళిత దండోరా కార్యక్రమం నిర్వహించింది. కాంగ్రెస్ నేతల రాకతో దళితవాడలు మలినం అయ్యాయంటూ... పాల శుద్ధి చేసేందుకు వెళ్లారు టీఆర్ఎస్ నేతలు. వారిని అడ్డుకున్నారు గ్రామస్తులు. ఇన్నేళ్లుగా ఊరికి ఎందుకు పట్టించుకోలేదని... డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఏమయ్యాయని టీఆర్ఎస్ నాయకులను నిలదీశారు దళితవాడలోని మహిళలు. వారం రోజుల్లోగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం మొదలు కాకపోతే... తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర ఆత్మహత్య చేసుకుంటామని దళిత మహిళలు హెచ్చరించారు. దీంతో టీఆర్ఎస్ నేతలు నిరాశగా వెనుదిరిగారు.