వీళ్లను మ్యూజియంలో పెట్టాలి : కుండపోత వర్షంలో మొక్కలకు నీళ్లు

వీళ్లను మ్యూజియంలో పెట్టాలి : కుండపోత వర్షంలో మొక్కలకు నీళ్లు

బెంగళూరులో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. కనీసం రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మరో వైపు జూన్ 20న ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఈ సందర్భంలో మున్సిపల్ ట్యాంకర్ తో మొక్కలకు నీరు పోస్తున్న ఓ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ ఫొటోపై నెటిజన్లు పలురకాలుగా స్పందిస్తున్నారు. మరికొందరు అధికార యంత్రాంగంపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇదిలా ఉండగా బెంగళూరులో కురుస్తున్న వర్షాలకు సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్ ఏరియాల్లో ట్రాఫిక్ జామ్ లు సంభవిస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనేక ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. రోడ్లపై ప్రయాణించడం కష్టంగా మారడంతో చాలా మంది మెట్రో సర్వీసులను ఉపయోగించుకుంటున్నారు.