కరోనాపై విరుష్క జంట వీడియో సందేశం

కరోనాపై విరుష్క జంట వీడియో సందేశం

మేం ఇంట్లోనే ఉన్నాం.. మీరూ ఉండండి

న్యూఢిల్లీ: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు సెల్ఫ్‌ –ఐసోలేషన్‌ అత్యుత్తమ మార్గమని టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ అభిప్రాయపడ్డాడు. ప్రజలంతా తమ ఇళ్లలోనే ఉండాలని సూచించాడు. ఆదివారం జనతా కర్ఫ్యూలో పాల్గొనాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రజలు బయటికి రాకుండా తమ ఇళ్లలోనే ఉండాలని కోహ్లీ, అనుష్క ట్విటర్‌లో వీడియో సందేశం ఇచ్చారు. ‘ఇప్పుడు మనం విపత్కర పరిస్థితుల్లోకి వెళ్తున్నా మని అందరికీ తెలుసు. మనమంతా ఏకమైతేనే కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టగలం. మా సేఫ్టీ కోసం మేం ఇంట్లోనే ఉంటున్నాం. మీరు కూడా మీ ఇళ్లలోనే ఉండండి. వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా అడ్డుకునేందుకు ఇదే అత్యుత్తమ మార్గం. ప్రతి ఒక్కరం సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉండి మనల్ని మనం కాపాడుకుందాం’ అని చెప్పుకొచ్చారు. అందరూ ఇంట్లోనే ఉండి, ఆరోగ్యంగా ఉండాలని సూచించారు.