IPL 2025 FINAL: ఒకే ఒక్కడు.. ఐపీఎల్‎లో మరో ఆల్ టైం రికార్డ్ సృష్టించిన విరాట్ కోహ్లీ

IPL 2025 FINAL: ఒకే ఒక్కడు.. ఐపీఎల్‎లో మరో ఆల్ టైం రికార్డ్ సృష్టించిన విరాట్ కోహ్లీ

గాంధీనగర్: రికార్డుల  రారాజు, రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్‎లో మరో అరుదైన రికార్డ్ క్రియేట్ చేశాడు. ఐపీఎల్ హిస్టరీలో అత్యధిక ఫోర్లు (770) కొట్టిన బ్యాటర్‎గా చరిత్ర సృష్టించాడు. గుజరాత్‎లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా పంజాబ్‎తో జరుగుతోన్న ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‎లో ఈ ఫీట్ నెలకొల్పాడు. ఇంతకుముందు ఈ రికార్డ్ టీమిండియా మాజీ స్టార్ క్రికెటర్ శిఖర్ ధావన్ పేరిట ఉండేది. 

క్యాచ్ రిష్ లీగ్ లో ధావన్ 768 ఫోర్లు కొట్టాడు. తాజా మ్యాచులో పంజాబ్‎పై 3 ఫోర్లు కొట్టడం ద్వారా ధావన్ రికార్డ్‎ను బ్రేక్ చేసిన కోహ్లీ ఐపీఎల్‎లో తన పేరిట మరో రికార్డును లిఖించుకున్నాడు. కోహ్లీ, ధావన్ తర్వాత ఐపీఎల్‎లో అత్యధిక ఫోర్లు కొట్టిన బ్యాటర్ల జాబితాలో వార్నర్ (663), రోహిత్ శర్మ (640), రహానే (540) ఉన్నారు. 

ఇక, గుజరాత్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఆర్సీబీ, పంజాబ్ మధ్య ఐపీఎల్ ఫైనల్ సమరం హోరాహోరీగా సాగుతోంది. టాస్ ఓడిన ఆర్సీబీ తొలుత బ్యాటింగ్‎కు దిగింది. సాల్ట్ 16, కోహ్లీ 43, మయాంక్ 24, పటిదార్ 26, లివింగ్ స్టోన్ 25, జితేశ్ శర్మ 24 పరుగులు చేశారు. ప్రస్తుతం 18 ఓవర్లకు ఆరు వికెట్ల నష్టానికి 173 రన్స్ చేసింది. క్రీజులో షెఫర్డ్ 7, కృనాల్ పాండ్యా 2 ఉన్నారు.