ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ , రోహిత్ శర్మ ఈ సీజన్ ను టాప్ ర్యాంకులతో ముగించారు. వెస్టిండీస్ తో వన్డే సిరీస్ లో సత్తా చాటిన ఈ ఇద్దరూ ఐసీసీ వన్డే బ్యాట్స్ మెన్ ర్యాంకింగ్స్ లో తొలి రెండు స్థానాల్లో నిలిచారు. ఆదివారం జరిగిన చివరి వన్డేలో కీలక ఇన్నింగ్స్ తో ఇండియాను గెలిపించిన కోహ్లీ టాప్ ర్యాంక్ ను నిలబెట్టుకున్నాడు. ఇక వైజాగ్ వన్డేలో భారీ సెంచరీ, కటక్ లో హాఫ్ సెంచరీతో రాణించిన రోహిత్ సెకండ్ ప్లేస్ లో నిలిచాడు.
ఇండియా ఇతర బ్యాట్స్ మెన్ లో లోకేశ్ రాహుల్ , శ్రేయస్ ర్యాంకులు మెరుగయ్యాయి. రాహుల్ 17 ప్లేస్ లు మెరుగై 71వ స్థానంలో నిలవగా..అయ్యర్ 104 నుం చి 81 ర్యాంక్ కు చేరుకున్నాడు. కాగా, విండీస్ ఓపెనర్ షై హోప్ టాప్ 10 లోకి వచ్చాడు. ఇండియాపై చెలరేగి ఆడిన అతను ఐదు స్థానాలుమెరుగై తొమ్మిదో ప్లేస్ సాధించాడు. అలాగే, షిమ్రన్ హెట్ మయర్ 25 నుంచి 19కి, నికోలస్ పూరన్ 63 నుంచి 30వ ప్లేస్ కు చేరుకున్నారు. ఫాస్ట్ బౌలర్లలో షెల్డన్ కాట్రెల్ 36 నుంచి 30వ ప్లేస్ కు వచ్చాడు.